Current Date: 05 Oct, 2024

రాజేంద్రప్రసాద్‌ కుమార్తె మృతిపై సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం

సినీనటుడు రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి (38)  గుండెపోటుతో మరణించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ తదితరులు సంతాపం వ్యక్తంచేశారు.   ‘సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి చిన్న వయసులోనే అకాల మరణానికి గురికావడం అత్యంత దురదృష్టకరం. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నాను’’ అని చంద్రబాబు సంతాపం తెలిపారు. 

Share