Current Date: 04 Oct, 2024

పులస వలస పోతోందా!

పులస చేప ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ఇక గోదారోళ్లకైతే అస్సలు చెప్పక్కర్లేదు! ఏటా జూలై, ఆగస్టు నెలల్లో గోదావరి నదిలోకి వరస కట్టి  ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సీఫుడ్ ప్రియుల జిహ్వచాపల్యాన్ని తీర్చుతుంటాయి పులసలు. పుస్తెలమ్మి అయినా పులస తినాలనే నానుడి గోదావరి జిల్లాల్లో ఉందంటే.ఆస్థాయిలో ఫేమస్ అయిన పులస రాక సుమారు పదేళ్లుగా ఏటా తగ్గుతూ వస్తోన్న పరిస్థితి. ఈ సీజన్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలులో ఒక పులస మత్స్యకారులకు వలకు చిక్కింది. దాన్ని వేలం వేస్తే రూ.24 వేలకు పలికింది. దాని తర్వాత అక్కడక్కడా ఒకటో రెండో చిక్కినట్లు చెప్పుకున్నారు. అంతకు మించి ఈసారి పులస సందడి కనిపించలేదు. ఇలా ప్రధానంగా గోదారోళ్లపై పులస అలిగినట్లు ఉన్న ఈ వ్యవహారంపై తాజాగా సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వాటర్ రీఛార్జ్ ఇనిస్టిట్యూట్ (సిఫ్రీ) ఓ అధ్యయనం నిర్వహించిందంట. దీనిలో పలు కీలక, షాకింగ్ విషయాలు వెల్లడైనట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా బంగాళాఖాతం నుంచి గోదావరి వైపు ఈ క్వీన్ ఆఫ్ ది ఫిష్ రావడం లేదని తేలిందని అంటున్నారు. 

Share