Current Date: 10 Oct, 2024

అల్లు అర్జున్ పుష్ప సెట్‌లో జానీ మాస్టర్ గొడవ జరిగిందిదే

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో జానీ మాస్టర్ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.ఈ వివాదంపై ప్రముఖ కొరియోగ్రాఫర్ కస్తూరి మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొరియోగ్రాఫర్ కస్తూరి మాస్టర్ ఓ ఇంటర్య్యూలో మాట్లాడుతూ.. జానీ మాస్టర్ ను కావాలనే కేసులో ఇరికించారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసులు బనాయించారని షాకింగ్ కామెంట్స్ చేసింది.పుష్ప లొకేషన్స్ లో ఆ అమ్మాయిపై జానీ మాస్టర్ దాడి చేశారని ఆరోపణలు వచ్చాయని ప్రశ్నించగా.. పుష్ప సెట్స్ లోకి జానీ మాస్టర్ వెళ్లిన విషయం వాస్తవమేనని, కానీ అక్కడ వారు తమ పర్సనల్ విషయాలను చర్చించుకున్నారని, ఈ క్రమంలో వారిద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరిగిందని, ఈ సమయంలోనే డైరెక్టర్ సుకుమార్ ఇన్వాల్వ్ ఆ సమస్యను అక్కడితో పరిష్కరించారని అన్నారు.

Share