Current Date: 05 Oct, 2024

రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కి మళ్లీ ఏమైంది? సభలో అస్వస్థత

పారిస్ ఒలింపిక్స్ 2024లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్ కు వెళ్లిన వినేశ్ ఫొగాట్అనంతరం అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆరోగ్యం ఇంకా మెరుగుపడినట్లు లేదుఫైనల్‌కి ముందు 50కేజీల బరువుకి 2 కేజీలు ఎక్కువగా ఉండటంతో  గంటల వ్యవధిలో బరువు తగ్గేందుకు తీవ్రంగా కష్టపడిన వినేశ్  పోటీకి అర్హత సాధించలేకపోయింది. దాంతో తీవ్ర అస్వస్థతకి గురై అక్కడే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది.తాజాగా స్వదేశానికి తిరిగి వచ్చిన ఫొగాట్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. పారిస్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఆమె ఆ తర్వాత  హర్యాణాకి వెళ్లారు. అక్కడ స్వగ్రామంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా.. కుర్చీలో కూర్చుని అలానే వెనక్కి ఫొగాట్ పడిపోయింది.

Share