ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ నికోలస్ పూరన్ కేవలం 26 బంతుల్లోనే 70 పరుగులు చేసి తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు నమోదు కావడం విశేషం. ఈ క్రికెటర్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదాడు. దీంతో అతడు ఐపీఎల్ చరిత్రలో 20 బంతుల్లోపే అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఇప్పటివరకు పూరన్ ఈ ఫీట్ను నాలుగు సార్లు సాధించాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్లు చెరో మూడు హాఫ్ సెంచరీలతో సంయుక్తంగా రెండవ స్థానంలో ఉన్నారు. ఇక పూరన్ నిన్నటి మ్యాచ్లో ఏకంగా 269.23 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం గమనార్హం.
Share