Current Date: 05 Oct, 2024

ఐదు రాష్ట్రాల మోస్ట్‌ వాంటెడ్‌ కమాండర్ల హతం

ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదు రాష్ట్రాల మోస్ట్‌ వాంటెడ్‌ నక్సలైట్‌ కమాండర్లు కమలేశ్‌ అలియాస్‌ ఆర్కే, నీతి అలియాస్‌ ఊర్మిళ మరణించినట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌ తర్వాత భద్రతా బలగాలు ఘటనా స్థలం నుంచి శనివారం ఉదయానికి 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశంలో భారీ ఎత్తున కూంబింగ్‌ కొనసాగుతోంది. పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు కమలేశ్‌ ఐదు రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నాడు. ప్రత్యేక మండల కమిటీ సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా వ్యవహరించాడు. నీతి అలియాస్‌ ఊర్మిళ బీజాపూర్‌ జిల్లా గంగలూరు ప్రాంతానికి చెందినవారు. కాగా, కమలేశ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. 

Share