Current Date: 07 Oct, 2024

ఆమెను చంపేసి శవాన్ని ఆటోలో పోలీస్ స్టేషన్ కు తెచ్చాడు

 మహిళను చంపేసి ఆటోలో శవాన్ని నేరుగా పోలీస్ స్టేషన్ కే తీసుకు వెళ్ళాడో ఘనుడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు.వివరాలిలాఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా  పొందూరు మండలం చిన్న బొడ్డేపల్లి గ్రామానికి చెందిన అమలాపురపు రాజేశ్వరి భర్తను పోగొట్టుకోవడంతో కుమార్తెతో కలిసి ఆ గ్రామాంలోనే ఓ పాన్ షాప్ పెట్టుకుని నివసిస్తోంది. ఇదిలా ఉంటే ఆమెకు దూరపు బంధువైన గోపాలరావు అనే ఆటో డ్రైవర్ నిత్యం ఆమెతో సాన్నిహిత్యoగా ఉంటూ ఆమెకు కావాల్సిన సరకుల్ని తెచ్చిపెడుతూ ఉండేవాడు. ఆ పరిచయం అలా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్యా ఏం జరిగిందో ఏమో గాని మంగళవారం రాజేశ్వరి (రాజు)ని గోపాలరావు చంపేశాడు. ఈ హత్యకు ఆయనే ప్రధాన కారణమని పోలీసులు తేల్చి, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంభంధమే ఆమె జీవితాన్ని ఇలా పూర్తి చేసిందని గ్రామస్తులు చెబుతున్నారు.

Share