Current Date: 01 Oct, 2024

ఎన్టీఆర్ దేవరని పట్టించుకోని సెలెబ్రిటీలు.. మౌనం ఎందుకు?

జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ విడుదలై నాలుగు రోజులు అవుతోంది. సినిమాకు మిక్స్‌డ్ టాక్‌ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం అదిరిపోతున్నాయ్‌ అంటూ నిర్మాణ సంస్థ పోస్టర్‌ విడుదల చేస్తోంది. మూడు రోజులకు రూ.304 కోట్లు వసూలు చేసినట్లు టీమ్‌ పోస్టర్‌ విడుదల చేసింది. ఈ వసూళ్లు నిజమేనా? లేక కావాలనే ఇలా చేస్తున్నారా? అని సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. నిజానికి టాలీవుడ్‌లో సినిమా చిన్నదైనా, పెద్దదైనా బావుంటే సెలబ్రిటీలు ,తన సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా ఆయా చిత్ర బృందాలకు అభినందనలు తెలియజేస్తుంటారు. చిరంజీవి, మహేష్‌,  అల్లు అర్జున్‌ లాంటి హీరోల నుంచి రాజమౌళి వంటి అగ్రదర్శకుల వరకూ ట్వీట్‌ ద్వారా విష్‌ చేస్తుంటారు. కానీ దేవర సినిమా విషయంలో ఆ తరహా స్పందన రాలేదు. ఎన్టీఆర్‌ హార్డ్‌ కోర్‌  అభిమానులను ఆకట్టుకోలేకపోయిందని పబ్లిక్‌లో టాక్‌ నడుస్తోంది. దేవర రిలీజ్‌ ముందు వరకు టీమ్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పిన సెలబ్రిటీలు .. దేవర రిలీజ్‌ అనంతరం ఒక్కసారిగా మౌనం వహిస్తుంటే దేవర పూర్తిస్థాయిలో ఎవరినీ ఆకట్టుకోలేకపోయిందా అనే చర్చ నడుస్తోంది. నెగటివ్ టాక్ సినిమాను బాగుందని పొగిడితే ట్రోల్ అయిపోతామని భయపడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Share