తెలుగు సినీ పరిశ్రమను ఎన్నో ఏళ్లుగా పట్టిపీడిస్తున్న పైరసీ భూతం తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం ‘పెద్ది’ని కూడా వదల్లేదు. థియేటర్లలో విడుదలైన రెండో రోజే ఈ సినిమాకు సంబంధించిన హై క్వాలిటీ హెచ్డీ ప్రింట్ ప్రముఖ పైరసీ వెబ్సైట్లలో ప్రత్యక్షం కావడం టాలీవుడ్లో తీవ్ర కలకలం రేపుతోంది. దర్శకుడు బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. మొదటి రోజే వరల్డ్వైడ్గా రూ. 135 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. వీకెండ్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్న తరుణంలో ఈ పైరసీ లీకేజీ రూపంలో చిత్రబృందానికి పెద్ద షాక్ తగిలింది. సోషల్ మీడియా వేదికగా సైబర్ క్రైమ్ పోలీసులను, చిత్ర డిజిటల్ టీమ్ను ట్యాగ్ చేస్తూ.. ఇంటర్నెట్ నుండి పైరసీ లింకులను వెంటనే తొలగించాలని, థియేటర్లలో సినిమాను చూసి పైరసీని అరికట్టాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.