Current Date: 06 Jul, 2024

End of YCP Government on June 4

 విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌లతో కలిసి ప్రజాగళం రోడ్డు షోలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. విజయవాడలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లతో తాను పాల్గొన్న రోడ్‌ షో మరపురానిదని పేర్కొన్నారు. 
గత కొన్ని రోజులుగా తాను ఏపీలో పర్యటిస్తున్నానని, ఏపీ ప్రజలు ఎన్డీయే కూటమి అభ్యర్థులకు భారీగా ఓట్లు వేయనున్నారన్న విషయం అర్థమైందని తెలిపారు. మహిళలు, యువ ఓటర్ల మద్దతతో ఎన్డీయే అభ్యర్థులకు భారీ మెజారిటీ ఖాయమని ప్రధాని మోడీ పేర్కొన్నారు.  
ఏపీ అధికార పక్షం వైసీపీని ఉద్దేశించి కూడా ప్రధాని మోడీ విమర్శలు సంధించారు. కాంగ్రెస్‌ పార్టీ సంస్కృతితో వైసీపీకి బలమైన అనుబంధం ఉందని, అందుకే ఆ పార్టీ రాష్ట్రంలో అవినీతి, కుటిలత్వం, మాఫియా తత్వాన్ని పెంచి పోషించిందని మోదీ ధ్వజమెత్తారు. వైసీపీతో ఏపీ ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, వాళ్ల ప్రభుత్వానికి జూన్‌ 4వ తేదీతో ఆఖరు అని స్పష్టం చేశారు. 
ఇక బీజేపీ, టీడీపీ గతంలోనూ కలిసి పనిచేశాయని, భవిష్యత్‌ అభివృద్ధి దిశగా తమది బలమైన బంధం అని స్పష్టం చేశారు. ఎంతో క్రియాశీలకంగా ఉన్న జనసేన పార్టీ వల్ల తమ కూటమి మరింత బలోపేతం అయిందని వివరించారు. తమ ఆకాంక్షలు నెరవేర్చే సత్తా ఈ కూటమికి ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని మోదీ తన ట్వీట్‌లో వెల్లడిరచారు.