Current Date: 04 Oct, 2024

వైఎస్సార్‌ జిల్లాకు చేరుకున్న జగన్‌

  వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం వైఎస్సార్‌ జిల్లాకు చేరుకున్నారు. మూడు రోజులపాటు పర్యటించనున్న ఆయనకు కడప ఎయిర్‌పోర్టులో పార్టీ నాయకులు సాదర స్వాగతం పలికారు.   తొలుత.. పెండ్లిమర్రి మండలం మాచునూరు గ్రామానికి చేరుకొని ఇటీవల మృతిచెందిన వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ మాచునూరు చంద్రారెడ్డి కుటుంబాన్ని  ఆయన పరామర్శించారు. మధ్యాహ్నం పార్టీ నేతలతో మాట్లాడారు.  కడప మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మాచవరం చంద్రహాసరెడ్డి కుమార్తె వివాహం ఈ మధ్యే జరిగింది. గొందిపల్లెలోని ఆయన నివాసానికి వెళ్లి జగన నూతన వధూవరులను ఆశీర్వదించారు. తరువాత పులివెందులలోని తన నివాసానికి వెళ్లారు.

Share