Current Date: 23 Sep, 2024

సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఉదయం సీఎం నివాసానికి వెళ్లిన చిరంజీవి  రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇటీవల వరద బాధితుల సహాయార్థం తాను ప్రకటించిన రూ.50 లక్షలు, తన కుమారుడు రాంచరణ్ ప్రకటించిన మరో 50 లక్షలకు సంబంధించిన చెక్కులను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.  ఈ సందర్భంగా చిరంజీవితో కాసేపు చర్చించిన రేవంత్ రెడ్డి  శాలువాతో చిరును సత్కరించారు.

Share