Current Date: 02 Jul, 2024

ఉమ్మడి ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్‌ కన్నుమూత

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పిసిసి మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాస్ మృతికి సిఎం నారా చంద్రబాబు నాయడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి.శ్రీనివాస్ మంత్రిగా, ఎంపిగా తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. శ్రీనివాస్ ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసేవారని…. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని అన్నారు. డి.శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి  తెలిపారు.

Share