Current Date: 06 Oct, 2024

దేశంలో అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా

కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలు హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు.  దేశంలో అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తున్నానని  వ్యాఖ్యానించారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన 11వ సారి దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ  మహిళా ఉద్యోగుల మెటర్నిటీ సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచామని ఆయన గుర్తు చేశారు. తాము మహిళలను గౌరవించడమే కాకుండా వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

Share