Current Date: 05 Oct, 2024

నందమూరి ఫ్యామిలీలో మళ్లీ గొడవ తెరపైకి!

నందమూరి ఫ్యామిలీలో మళ్లీ పాత గొడవ తెరపైకి వచ్చింది. బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకకి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌కి ఆహ్వానాలు అందే సూచనలు కనిపించడం లేదు. ఒకవేళ అందినా వాళ్లు మాత్రం వచ్చే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి.
నందమూరి హరికృష్ణ మరణం తర్వాత బాలకృష్ణతో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 
డెవిల్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బాలయ్యను ముఖ్య అతిథిగా పిలుద్దామని ప్రొడ్యూసర్, డైరెక్టర్ అనుకున్నారు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం సీరియస్ అయ్యాడట.బాబాయ్‌ను పిలవాల్సిన అవసరం లేదని, పిలిచినా రాడని, అతన్ని పిలవాలనే ఆలోచన పెట్టుకోవద్దని అప్పట్లో ఖరాఖండిగా చెప్పేశాడట. ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ తారక్, కళ్యాణ్ రామ్ మౌనంగా ఉండిపోవడం బాలయ్యకి మరింత కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. దాంతో నందమూరి ఫ్యామిలీ మళ్లీ ఒకే వేదికపై కనిపించడం ఇక కష్టమే.

Share