Current Date: 28 Sep, 2024

కోహ్లీకి ముడిపెడుతూ పంత్‌పై ఫేక్ వార్త కోప్పడిన క్రికెటర్

ఐపీఎల్‌ 2025 మెగా వేలానికి ముందు రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. రిషభ్‌ పంత్ గురించి ఒక తప్పుడు వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కాస్తా అతడి దృష్టికి వెళ్లింది.‘‘ఐపీఎల్‌ 2025కి ముందు రిషభ్‌ పంత్.. ఆర్సీబీలో చేరాలని భావిస్తున్నాడు. ఇందుకోసం తన మేనేజర్‌ ద్వారా రిషభ్‌ పంత్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీని సంప్రదించాడు. కెప్టెన్‌ ప్లేసు ఖాళీగా ఉంటే ఇవ్వాలని కోరాడు. కానీ, ఆ ఫ్రాంఛైజీ పంత్‌ అభ్యర్థనకు ఒప్పుకోలేదు. ఎందుకంటే పంత్‌ అక్కడకు రావడం విరాట్ కోహ్లీకి ఇష్టం లేదు. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్‌లో, భారత క్రికెట్‌ జట్టులో చేసినట్లుగా అతడు ఆర్సీబీలో రాజకీయాలు చేస్తాడని.. పంత్‌ రాకను కోహ్లీ వద్దన్నాడు’’ అని ట్విట్టర్‌లో  ఓ యూజర్‌ పేర్కొన్నాడు. దాంతో రిషబ్ పంత్  కాస్త గట్టిగానే కౌంటర్‌ ఇచ్చాడు. 

Share