Current Date: 06 Jul, 2024

రాచకొండ ఆర్ధిక సాయం

రాచకొండ చారిటీస్ సంస్థ ద్వారా రాచకొండ దశరధ రామయ్య కుటుంబ సభ్యులు చేస్తున్న సాయం వల్ల ఎంతోమంది లబ్ది పొందుతున్నారు. జోడుగుళ్ళపాలెంలో మత్సకార కుటుంబానికి చెందిన దగులుపిల్లి భార్గవి (15) మల్టీ ఆర్గాన్స్ దెబ్బ తినడంతో ఆస్పత్రిపాలైంది. బాలిక వైద్యం ఖర్చుల నిమిత్తం రామయ్య దంపతులు రూ.1.11లక్షల మొత్తాన్ని రెండు చెక్కుల రూపంలో బాలిక తల్లిదండ్రులకు అందజేశారు.. రోటరీ క్లబ్ ప్రతినిధి మధుసూదనరావు, స్టేట్ బ్యాంక్ పెన్షనర్స్ క్లబ్ సభ్యులు కోటేశ్వరరావు, ఏయూటీడీ సంస్థ కార్యదర్శి ప్రగడ వాసు, కాలనీ పెద్దలు ఉమ్మడి అప్పారావు, దాసు, పోలి తదితరుల సమక్షంలో సాయం అందింది. దీంతో బాలిక తల్లిదండ్రులు కొండ, అప్పారావు వారందరికీ కృతజ్ఞాతలు తెలియజేశారు.

Share