Current Date: 06 Jul, 2024

వీసీ రాజీనామాకు అమరావతి రైతుల డిమాండ్‌

 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) వద్ద ఉద్రిక్తత నెలకొంది. గతంలో 3 రాజధానులకు అనుకూలంగా సమావేశం నిర్వహించిన వీసీ రాజశేఖర్‌ రాజీనామాకు అమరావతి ప్రాంత రైతులు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో బుధవారం వర్సిటీ వద్ద ఆందోళనకు దిగారు. గేట్లు నెట్టుకుంటూ లోపలికి వెళ్లారు.  రాజధాని రైతులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని పక్కకు నెట్టేశారు. వీసీ కార్యాలయానికి తాళం వేశారు. దీంతో రైతులు అక్కడే బైఠాయించారు. వీసీ పదవి నుంచి రాజశేఖర్‌ తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజధాని రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు.

Share