Current Date: 31 Mar, 2025

తార‌స్థాయికి మంచు కుటుంబం గొడ‌వ‌లు...మ‌రోసారి గొడ‌వ చేస్తే తీవ్ర చ‌ర్య‌లు తప్పవని సీపీ హెచ్చ‌రిక‌...

ఫ్యామిలీ గొడ‌వ‌ల‌కు సంబంధించి నోటీసులు అందుకున్న మంచు సోద‌రులు మ‌నోజ్‌, విష్ణు..  రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. అద‌న‌పు మేజిస్ట్రేట్ హోదాలో సీపీ వారిని విచారించారు. ఈ సందర్భంగా.. కుటుంబ స‌మ‌స్య‌ను శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌గా మార్చొద్ద‌ని, ఇరు వ‌ర్గాలు శాంతియుతంగా, సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా స‌మ‌స్య‌ను ప‌రిష్కరించుకోవాల‌ని సీపీ వారికి సూచించిన‌ట్లు స‌మాచారం. అలాగే మ‌రోసారి ఘ‌ర్ష‌ణ‌కు దిగితే తీవ్ర చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించిన‌ట్లు తెలుస్తోంది. మొద‌ట మంచు మ‌నోజ్, ఆ తరువాత విష్ణు వాంగ్మూలం తీసుకున్నారు.  సీపీ ఆదేశాల మేర‌కు మంచు మ‌నోజ్ ఏడాదిపాటు ప్ర‌తికూల చ‌ర్య‌ల‌కు దిగ‌కుండా, శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల‌గ‌కుండా చూస్తాన‌ని రూ.1ల‌క్ష పూచీక‌త్తు స‌మ‌ర్పించారు.

Share