Current Date: 05 Oct, 2024

స్నేహితుల దినోత్సవం రోజు విషాదం

 ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్ లో పడి గీతం విద్యార్థి డాకి  నిరంజన్(20) మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గీతం కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతున్న నిరంజన్,ఆశిష్,రేహాన్,లలిత్,మోషిత్ ఐదుగురు విద్యార్థులు స్నేహితుల దినోత్సవం కావడంతో గంభీరం రిజర్వాయర్ కు వచ్చారు.ఇందులో నిరంజన్ కాలుజారి రిజర్వాయర్ లో పడగా అతనిని రక్షించేందుకు మిగతా ఇద్దరు విద్యార్థులు   అందులో దూకారు.వాళ్లు నీటిలో మునిగిపోవడంతో  స్థానికులు ఇద్దరు యువకులను రక్షించగా  నిరంజన్ గల్లంతయ్యాడు. రెస్క్యూ టీం గల్లంతైన నిరంజన్ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చింది.విషయం తెలుసుకున్న మృతుడి స్నేహితులు పదుల సంఖ్యలో చేరుకుని బోరున విలపించారు.మృతుడు నిరంజన్ పలాసకు చెందిన యువకుడు అన్నారు. ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share