Current Date: 06 Oct, 2024

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయ మొదటి బ్లాక్‌లోని సీఎం ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ కుమార్‌ ప్రసాద్‌, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధ శాఖల ఉన్నతాధికారలు, వివిధ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు ర్యాలీగా బయలుదేరిన చంద్రబాబుకు రైతులు అఖండ స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెలగపూడి సచివాలయానికి బయలుదేరిన చంద్రబాబుకు దారి పొడవునా పూలతో స్వాగతించారు. భారీ గజమాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దారి పొడవునా రైతులకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు

Share