Current Date: 06 Oct, 2024

ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు

అమరావతి, న్యూస్‌లీడర్‌, జూన్‌ 13: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఏస్‌ అధికారి ముద్దాడ రవిచంద్ర గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈమేరకు రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకులో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆయనకు దివ్య ఆశిస్సులు అందించారు. అనంతరం పలువురు అధికారులు, సిబ్బంది రవిచంద్రకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

Share