Current Date: 01 Oct, 2024

మల్లారెడ్డిని టార్గెట్ చేసిన హైడ్రా అక్రమాల్ని పరిశీలించిన కమిషనర్

హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలు నిర్మించిన వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న హైడ్రా ఇప్పుడు మల్లా రెడ్డి భవనాలపై కన్నేసింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అడ్డాలో ఏవీ రంగనాథ్ అధికారులతో కలిసి నిన్న విస్తృతంగా పర్యటించి ఆ ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాల గురించి ఆరా తీశారు. దాంతో నెక్ట్స్ టార్గెట్ మల్లారెడ్డి అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అక్రమ కట్టడాల్ని నిర్మూలించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ - (హైడ్రా)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  ఈ హైడ్రా నుంచి ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఏ బుల్డోజర్ వచ్చి తమ ఇళ్లు కూల్చేస్తుందో అని అక్రమార్కులు భయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. నగరంలోని చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా చేసినట్లు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. మాజీ మేయర్ మేకల కావ్యకు చెందిన ఫామ్‌హౌస్‌కు అనుమతులు లేవని గుర్తించారు. అంతేకాకుండా అంబేడ్కర్ నగర్‌లోని ఇంద్రా చెరువు, డంపింగ్ యార్డు సమీపంలోని నాలా ఆక్రమణకు గురైనట్టు హైడ్రా అధికారులు తేల్చారు. 

Share