Current Date: 04 Jul, 2024

అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు అండమాన్‌ దీవులను తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రతి ఏటా మే 18-20 మధ్య ఈ ప్రక్రియ జరుగుతుండగా ఈ సారి కూడా అలాగే రుతుపనాలు కదులుతున్నాయని తెలిపింది. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులు, దక్షిణ అండమాన్‌, మాల్దీవులు, కొమోరిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపనాలు విస్తరించాయని పేర్కొంది. ఈ నెల 31కి నైరుతి కేరళ తీరాన్ని, జూన్‌ మొదటివారంలో రాయలసీమను తాకనున్నట్లు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమలో వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల చివరి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడొచ్చని అంచనా వేసింది.  పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.