Current Date: 04 Jul, 2024

కేజ్రీవాల్ కు బెయిల్

 ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది.
లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు రానున్నారు. గత మార్చి 21న కేజ్రీవాల్ అరెస్టయిన సంగతి తెల్సిందే. మొన్నటి లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయనకు కోర్టు అనుమతిచ్చిన విషయం తెల్సిందే. అనంతరం కేజ్రీవాల్ కోర్టులో లొంగిపోయారు.

Share