Current Date: 26 Sep, 2024

జగన్‌తో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్‌కి కొత్త చిక్కులు మెమో జారీ

గుంటూరులో వైయస్ జగన్‌తో సెల్ఫీ తీసుకున్న మహిళా కానిస్టేబుల్‌ చిక్కుల్లో పడ్డారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పరామర్శించడానికి గుంటూరు సబ్‌జైలుకి బుధవారం వైయస్ జగన్ వెళ్లారు. అక్కడ జైలు వద్ద మహిళా కానిస్టేబుల్‌ ఆయేషా బాను తన కుమార్తెతో కలిసి వచ్చి సెల్ఫీ తీసుకున్నారు.విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆయేషా బానుకి ఛార్జి మెమో ఇస్తామని జైలర్‌ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. విధి నిర్వహణను పక్కన పెట్టి సెల్ఫీ తీసుకోవడం సరికాదని అధికారులు సీరియస్ అయ్యారు.హెడ్ కానిస్టేబుల్ ఆయేషాబానుది స్వస్థలం అనంతపురం జగన్‌ ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. ఉదయం 10:30 గంటలకు పిఠాపురం చేరుకుని అక్కడి నుంచి మాధవపురం వెళ్లనున్నారు.. ఏలేరు వరద బాధిత ప్రాంతాలను పరిశీలిస్తారు.

Share