Current Date: 07 Oct, 2024

కేసీఆర్‌కి డబుల్ హ్యాట్రిక్ షాక్ఒకేసారి ఆరుగురు ఔట్!

తెలంగాణలో వలస రాజకీయాలు రోజురోజుకీ జోరందుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వారానికి ఒకరు చొప్పున ఎమ్మెల్యేలు జారుకుంటుండగా..  ఇప్పుడు ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న వెంటనే జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో వారిని చేర్చుకున్నారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఎమ్మెల్సీలు దండె విఠల్, భాను ప్రసాద్, ఎగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, బస్వరాజ్ సారయ్య ఉన్నారు. వీరంతా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 12కు పెరిగింది. మొత్తం మండలిలో సభ్యుల సంఖ్య 40 ఉండగా.. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి మనోధైర్యం నింపడానికి ఒకవైపు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తుండగా..మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు యథేచ్ఛగా సాగుతున్నాయి. 3 రోజుల క్రితమే సీనియర్ నేత కె.కేశవరావు కాంగ్రెస్ చేరిన విషయం తెలిసిందే. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

Share