Current Date: 29 Sep, 2024

స్ఫూర్తిదాయకమైన కథనాల వేదిక ‘మన్‌కీ బాత్‌’ ప్రధాని మేడీ

 మనసులో మాట పేరుతో ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమం 114వ ఎసిపోడ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజల ప్రయత్నాలు, స్ఫూర్తిదాయకమైన కథనాలను మన్‌కీబాత్‌ చూపిస్తోందన్నారు. కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తిచేసుకోనున్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌ తనకు భావోద్వేగమైనదని అన్నారు. సామూహిక శక్తిని ప్రదర్శించే ప్రత్యేక వేదికగా ఈ కార్యక్రమం మారిందన్నారు. మన్‌కీ బాత్‌ ద్వారా తన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియాకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

Share