Current Date: 06 Oct, 2024

తెలుగు జర్నలిజానికి రామోజీ..ఓ స్టయిల్‌ షీట్‌!

తెలుగు జర్నలిజానికి ‘ఈనాడు’ రామోజీరావు ఓ స్టయిల్‌ షీట్‌ అయ్యారని, ఆయనో కారణజన్ముడని, ప్రజలకు వ్యవహారిక భాషను చేరువ చేసిన వ్యక్తి అని ‘లీడర్‌’ ఎడిటర్‌, రైటర్స్‌ అకాడమీ చైర్మన్‌ వీవీ రమణమూర్తి కొనియాడారు. పౌర గ్రంథాలయంలో సోమవారం నిర్వహించిన రామోజీ సంతాప సభలో సహచర పాత్రికేయులతో కలిసి ఆయన రామోజీరావు చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం రమణమూర్తి మాట్లాడుతూ పాఠకుల నాడి పట్టుకుని, వారికేం కావాలో తెలుసుకోవడంలో రామోజీ సఫలీకృతులయ్యారన్నారు. ఏపీలో ఆంధ్రా పేరిట ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ అంటూ రాజ్యమేలుతున్న రోజుల్లో విశాఖ కేంద్రంగా రామోజీ స్థాపించిన ఈనాడు దినపత్రిక అప్పట్లో పెనుసంచలనమే అయ్యిందన్నారు. 

Share