Current Date: 05 Oct, 2024

స్కూల్‌ బస్సు బోల్తా విద్యార్థిని మృతి



 అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె సమీపంలో సోమవారం ఉదయం ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని అక్కడికక్కడమే మృతిచెందగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఓబులవారిపల్లె నుంచి సమీపంలోని శ్రీవాణి ప్రైవేటు పాఠశాలకు 20 మంది విద్యార్థులతో బస్సు బయలుదేరింది. ఓబులవారిపల్లె దాటిన తర్వాత ఓ చిన్న వంతెన వద్ద వెనక టైరు పొరపాటున రాయి ఎక్కడంతో బస్సు బోల్తా పడిరది. ఈ ఘటనలో బస్సులో ఉన్న రెండో తరగతి విద్యార్థిని భవిష్య (8) మృతిచెందింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ బస్సును ఎలాంటి కండిషన్‌ లేకుండా నడుపుతున్నట్లు పోలీసులు, అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share