Current Date: 05 Oct, 2024

అచ్చుతాపురం ఎస్ఈజడ్ కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఎస్ఈజడ్  కాలనీ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు  ప్రమాదం జరిగింది. లారస్ ఫార్మా కంపెనీకి ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు లారీని ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం నుంజునుంజు అయింది. ప్రమాదంలో రమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 12 మందికి గాయాలు కాగా ప్రభుత్వ వాహనంలో ఆసుపత్రికి  తరలించారు.
క్షతగాత్రులను సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుడు కుటుంబానికి నష్టపరిహారం అందించి ఆదుకోవాలన్నారు. 

Share