Current Date: 05 Oct, 2024

జగన్‌కి స్పీకర్ అయ్యన్న ఆఫర్ అసెంబ్లీకి వెళ్తాడా?

అసెంబ్లీకి వెళ్లకుండా న్యాయస్థానాల ద్వారా  ప్రతిపక్ష హోదా కోసం వెంపర్లాడుతున్న వైయస్ జగన్‌కి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల ముందు.. ఆ తర్వాత జగన్ గురించి అయ్యన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకి నొచ్చుకున్నట్లున్నాడు. దాంతో స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎన్నిక టైమ్‌లోనూ అసెంబ్లీకి జగన్ వెళ్లలేదు. అసెంబ్లీకి వచ్చినా ఒకరోజు మాత్రమే ఉండి వెళ్లిపోతున్నారు. రాలేదన్న అపవాదు ఎందుకని భావిస్తున్నారో ఏమో తెలియదు జగన్ అసెంబ్లీకి రావాలని, ప్రజా సమస్యలపై చర్చించాలని శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికీ కోరుతున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోవడం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో తనకి మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వరని జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదు. దాంతో జగన్‌కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ‘‘పదవులు వస్తుంటాయి, పోతుంటాయి, ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడు  అందుకు నేను అవకాశం కల్పిస్తా. అన్ని పార్టీలకు ఇచ్చిన విధంగానే నీకూ అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశం ఇస్తాను’’ అని జగన్‌కి ఆఫర్ ఇచ్చారు.

Share