Current Date: 24 Sep, 2024

ముంబయి నటి జిత్వానీ వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ లపై వేటు

తప్పులు చేసుకుంటూ పోతే తర్వాతి పరిస్థితి ఎలా ఉంటుందో ఏపీలో ఇప్పుడు రుజువైంది. ముంబయికి చెందిన ఒక సినీ నటి వ్యవహారంలో ఆదివారం ముగ్గురు ఐపీఎస్ ల్ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఒకే వ్యవహారంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ లపై చర్యలు చేపట్టడం ఏపీ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీలపై వేటు పడింది.ముంబయి నటి జిత్వానీ వ్యవహారంతో పాటు ఈ ముగ్గురిపైనా పలు అభియోగాలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

Share