Current Date: 05 Oct, 2024

మద్యం ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి ` సీఎం చంద్రబాబు

నేరస్థులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయవుతాయి. నేరస్థుడే రాజకీయ నేత, సీఎం అయితే ఏం జరుగుతోందో గత ఐదేళ్లలో చూశాం. మేం విడుదల చేస్తోన్న 7 శ్వేతపత్రాలు చూస్తే రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుస్తుంది’’అని ఏపీ సీఎం చంద్రబాబు  అన్నారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్‌ శాఖలో జరిగిన అవకతవకలపై అసెంబ్లీలో ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. మద్యం వినియోగం అమాంతం పెరిగిపోయింది. అయినా, ఏపీలో ఆదాయం తగ్గింది. ఎందుకంటే పెరిగిన ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లింది. ఎక్సైజ్‌ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలి’’అని చంద్రబాబు అన్నారు.

Share