Current Date: 02 Jul, 2024

తెలుగు మీడియా మొఘల్ రామోజీ కన్నుమూత

మీడియా మొఘల్, ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీ రావు గత బుధవారం అస్వస్థతకి గురయ్యారు.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం ఫిల్మ్‌సిటీలోని నివాసానికిరామోజీపార్థివదేహాన్నితరలించనున్నారు.మార్గదర్శి, ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్న రామోజీరావు.. తెలుగు మీడియా గమనాన్ని మార్చేసిన దార్శనికుడిగా పేరు గడించారు. రామోజీ ఫిల్మ్‌ సిటీ ఏర్పాటుతో హైదరాబాద్, ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధిలో ఆయన భాగమయ్యారు.