Current Date: 06 Jul, 2024

జగన్ దోపిడీ చూసి యావత్ దేశం షాకయ్యింది నారా లోకేశ్

రుషి కొండ ప్యాలెస్ కాంట్రవర్సీ జాతీయ మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఏపీ కేబినెట్ మంత్రి, టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేశ్ స్పందించారు. జగన్ దోపిడీ యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసిందని అన్నారు. తమ పిల్లలకు ఓ గూడు కల్పించేందుకు పేదలు అలమటిస్తుంటే జగన్ మాత్రం ప్రజాధనంతో తన కోసం ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఆయన దోపిడీ.. యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేశాయి. ఈ విషయంలో ఎంక్వైరీ జరిపించి, న్యాయం జరిగేలా చూస్తాము. ఈ భవనం ప్రజలకు చెందేలా చేస్తామని ఆయన అన్నారు.

Share