ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాజధాని అమరావతి ప్రాంతంలో ఇంటి స్థలం కొనుగోలు చేశారు. అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చాక సొంతిల్లు నిర్మించుకుంటానని పలుమార్లు చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు వెలగపూడి రెవెన్యూ పరిధిలో దాదాపు 5 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. సుమారు 25వేల చదరపు గజాల ఈ ప్లాట్ ఈ-6 రోడ్డుకు ఆనుకుని ఉంది. ఇది ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు రైతుల పేరిట ఉన్న రిటర్నబుల్ ప్లాట్. ఇప్పటికే ఆ రైతులకు డబ్బులు చెల్లించినట్లు సమాచారం. ఇందులో కొంత స్థలం ఇంటికి, మిగతాది వాహనాల పార్కింగ్, సిబ్బందికి గదులు, లాన్ కోసం వినియోగించనున్నారు.