Current Date: 05 Oct, 2024

తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల పై పరిమితి

 తిరుమలలో  వీఐపీ బ్రేక్‌ దర్శనాల పై   పరిమితి అవసరమని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని  సీఎం చంద్రబాబు తెలిపారు.  దేశం నలుమూలల నుంచి వచ్చే సాధారణ భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ అధికారులకు సూచించారు. భక్తుల సూచనల మేరకే చర్యలు చేపడతామని అన్నారు. కుటుంబంతో సహా శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న సీఎం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని రాత్రికి ఇక్కడే బసచేశారు.  శనివారం ఉదయం అత్యాధునిక వకుళామాత సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను  సీఎం ప్రారంభించారు. 

Share