Current Date: 02 Jul, 2024

కొండగట్టు అంజన్న సన్నిధిలో పవన్‌

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం కొండగట్టు అంజన్నను దర్శించుకొని, మొక్కు తీర్చుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ శుక్రవారమే హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి మాదాపూర్‌లోని తన ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు బయలుదేరారు. మధ్యాహ్నం 11 గంటలకు కొండగట్టు చేరుకున్నారు.  పవన్‌ వస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఘన స్వాగతం పలికారు. అందరికీ పవన్‌ అభివాదం చేశారు. అనంతరం ఆంజనేయస్వామి  వారిని దర్శించుకొని, మొక్కు చెల్లించుకున్నారు.

Share