Current Date: 21 Sep, 2024

నేను తిరుపతిలోనే ఉన్నా ప్రమాణానికి రావాలి వైవీ సుబ్బారెడ్డికి లోకేశ్ సవాల్


ప్రజలు మనపై పవిత్ర బాధ్యత పెట్టారని, దానిని హుందాగా నెరవేర్చాలని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో డయాలసిస్ సెంటర్ ప్రారంభించేందుకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం చేరుకున్న లోకేశ్.. ఈ ఉదయం ఎస్‌ఎల్‌వీ కల్యాణమండపంలో నిర్వహించిన ‘ఉత్తమ కార్యకర్త’  ‘మన టీడీపీ యాప్ ఛాంపియన్స్’తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్తుకు గ్యారెంటీ 2023-24 కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మన టీడీపీ యాప్ ద్వారా ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

Share