Current Date: 06 Jul, 2024

విశాఖ జాతీయ రహదారిపై లారి బోల్తా....

ఆనందపురం మండలం శొంఠ్యాం గ్రామం వద్ద ఈ రోజు వేకువజామున లారి బోల్తా పడింది. స్థానికులు వివరాల ప్రకారం.. చేపల లోడుతో ఉన్న లారీ నారాయణపురం నుంచి బీహార్ వెళ్తుండగా శొంఠ్యాం   గ్రామం సమీపంలో డివైడర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో లారి క్యాబిన్ విడిపోయింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే ఇందుకు కారణమని ప్రాధమిక సమాచారం.ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.