Current Date: 24 Sep, 2024

రావణాపల్లి ఆయకట్టుకు సాగునీటి విడుదల

నర్సీపట్నం నియోజకవర్గం పరిధి లో ఉన్న రావణాపల్లి రిజర్వాయర్ గేట్లను  ఏపీ స్పీకర్ అయ్యన్న తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్  గేట్లు ఎత్తి ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రావణపల్లి రిజర్వాయర్ ఆయకట్టు కింద సుమారు 3,000 ఎకరాలలో రైతులు పంటలు సాగు చేస్తున్నారని వివరించారు. రిజర్వాయర్ నీటి సామర్థ్యం 358 క్యూబిక్ మీటర్ల కాగా, ప్రస్తుతం 215 క్యూసెక్ మీటర్ల నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరమ్మత్తులకు గురైన గేట్లు స్థానంలో కొత్త గేట్లు మంజూరు చేశారని, వాటిని త్వరలో పెట్టడం జరుగుతుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలోనే రావణాపల్లి రిజర్వాయర్ అభివృద్ధి జరుగుతుందని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ రిజర్వాయర్ ను పట్టించుకునే నాధుడు లేడని, టీడీపీ ప్రభుత్వం మాత్రమే దీని అభివృద్ధి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం, గొలుగొండ మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జల వనరుల శాఖ అధికారులు, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.

Share