Current Date: 22 Sep, 2024

పాక్‌ మద్దతు తెలిపిన చైనాని హాకీలో మట్టికరిపించిన భారత్

పురుషుల హాకీ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో మ్యాచ్‌ సందర్భంగా పాక్‌ ఆటగాళ్లు చైనాకు మద్దతుగా నిలిచి అబాసుపాలయ్యారు. పాక్‌ ఇదే టోర్నీ సెమీఫైనల్లో చైనా చేతిలో ఘోరంగా ఓడింది. అయినా పాక్‌​ ఆటగాళ్లు నిసిగ్గుగా చైనా జెండాలు పట్టుకుని వేలాడారు. వారు ఏకంగా చెంపలపై చైనా జెండా స్టిక్కర్లు అంటించుకుని మద్దతు తెలిపారు.చైనాను 1-0 గోల్స్‌ తేడాతో ఫైనల్లో ఓడించిన భారత్ ఐదోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో భారత్ చైనాపై న్యారో మార్జిన్‌తో విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన తుది సమరంలో జుగ్‌రాజ్‌ సింగ్‌ 51వ నిమిషంలో గోల్‌ చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. భారత్‌ ఇదే లీడ్‌ను చివరి వరకు కొనసాగించి విజేతగా నిలిచింది.తాము మద్దతు తెలిపినా చైనా ఓడిపోవడంతో పాక్‌ ఆటగాళ్లు దిగాలుగా ఉండిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలవుతుండటంతో భారత అభిమానులు పాక్‌ను ఆటాడేసుకుంటున్నారు. వారి బుద్ధే అంతా చీవాట్లు పెడుతున్నారు.

Share