Current Date: 05 Oct, 2024

అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్

చంద్రబాబు నాయుడు కేబినెట్‌లోని పలువురు మంత్రుల పట్ల కొందరు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అసెంబ్లీ లాబీలో చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మధ్య జరిగిన సంభాషణల్లో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు సంబంధించి.. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉన్నతాధికారులు సరైన సమాధానాలు ఇవ్వడం లేదు. ఆ క్రమంలో సదరు ఉన్నతాధికారులపై మంత్రులు పవన్ కల్యాణ్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. గ్రామ పంచాయతీలకు నిధులు మళ్లింపు విషయంలో అధికారులు అందించిన సమాచారంపై పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు సరైన సమాధానం ఇవ్వకుండా.. పొడి పొడి సమాధానాలు చెప్పడం పట్ల మంత్రి పవన్ అభ్యంతరం తెలిపారు. ఇలాగే సమాధానాలు చెప్పాలని ఏమైనా నిబంధనలున్నాయా? అంటూ అధికారులను ఆయన ప్రశ్నించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఇచ్చేలా ఉండాలని అధికారులకు ఈ సందర్భంగా పవన్ సూచించారు.

Share