Current Date: 04 Jul, 2024

ఐపీఎల్‌లో ముగిసిన లీగ్ మ్యాచ్‌లు.. ప్లేఆఫ్స్ చేరిన టీమ్స్ ఇవే!

ఐపీఎల్ 2024 సీజన్‌లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. మార్చి 22న ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పోటీపడగా.. ప్లేఆఫ్స్‌కి 4 జట్లు అర్హత సాధించాయి. మిగిలిన ఆరు జట్లు ఇంటిబాట పట్టాయి. లీగ్ దశలో ప్రతి జట్టు 14 మ్యాచ్‌లు చొప్పున ఆడింది.

ప్లేఆఫ్స్‌కి చేరిన జట్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉన్నాయి. మిగిలిన చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ ఇంటిబాట పట్టాయి.

మంగళవారం నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఆదివారం ఫైనల్‌తో ఈ మెగా టోర్నీ ముగియనుంది. ప్లేఆఫ్స్‌కి చేరిన జట్లలో బెంగళూరు మినహా మిగిలిన 3 జట్లు ఇప్పటికే ఐపీఎల్ ట్రోఫీని గెలిచాయి.