Current Date: 06 Jul, 2024

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

 ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌లను జీఏడీకి అటాచ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్‌ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్‌ కుమార్ వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్‌ కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది  పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్‌కుమార్‌ సింఘాలపౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా సిద్ధార్థ్‌ జైన్‌ఉన్నతవిద్యాశాఖకార్యదర్శిగాసౌరభ్‌గౌర్‌నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరభ్‌గౌర్‌కు అదనపు బాధ్యతల  పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్‌ఐటీ, ఆర్టీజీఎస్‌ కార్యదర్శిగా కోన శశిధర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు ఉద్యాన,మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబుఎఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్ ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్నఆర్థికవ్యయ విభాగం కార్యదర్శిగా ఎం. జానక పశు సంవర్థకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం.నాయక్ గనులశాఖడైరెక్టర్‌,కమిషనర్‌గాప్రవీణ్‌కుమార్‌ఏపీఎండీసీఎండీగాప్రవీణ్‌కుమార్‌కు అదనపు బాధ్యతల మురళీధర్‌రెడ్డిని జీఏడీకి రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశంఆర్థికశాఖ కార్యదర్శిగా వి.వినయ్‌చంద్‌ను నియమిస్తూ సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Share