Current Date: 07 Oct, 2024

వైసీపీ నేతల అక్రమార్జనను రాబట్టాలన్న యనమల రామకృష్ణుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు టీడీపీ సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడు విలువైన సూచనలు చేశారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు బాగున్నాయని కితాబిచ్చారు. ఈమేరకు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. గతంలో ఆర్థిక మంత్రిగా సేవలందించిన యనమల.. తన అనుభవంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు పలు సూచనలు చేశారు వైసీపీ నేతల అక్రమార్జనను రెవెన్యూ రికవరీ చట్టం లేదా ప్రత్యేకమైన చట్టం ఉపయోగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని యనమల సూచించారు

Share