భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోంది. ఈనెల 22న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఆమె పెళ్లి జరగనుంది. వరుడు హైదరాబాద్కు చెందిన వెంకట దత్త సాయి అనే వ్యాపారవేత్త. ఈ విషయాన్ని ది హిందూ వెలుగులోకి తెచ్చింది.రియో ఓలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన పీవీ సింధు.. ఈ మధ్యే సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయి ఉన్నారు. పీవీ సింధు, వెంకట దత్త సాయి వివాహం.. డిసెంబర్ 22న ఉదయ్ పూర్ లో జరగనుంది.డిసెంబర్ 20 నుంచే పెళ్లి పనులు షురూ కానున్నాయి. డిసెంబర్ 24న హైదరాబాద్ లో పెళ్లి రిసెప్షన్ విందు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన తర్వాత సింధు కొన్నాళ్లు కెరీర్లో చేదు అనుభవాల్ని చవిచూసింది. అయితే.. ఆదివారం జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ సింగిల్స్ లో టైటిల్ గెలిచి మళ్లీ గెలుపుబాట పట్టింది.