Current Date: 02 Jul, 2024

Addicted to cricket betting.. Father killed his wife and child | #todaynews #ananthapuram #ananthapuramnews #breakingnews #cricket #cricketbetting #crime_news #viralvideo #viralnews #viralpost

Addicted to cricket betting.. Father killed his wife and child | #todaynews #ananthapuram #ananthapuramnews #breakingnews #cricket #cricketbetting #crime_news #viralvideo #viralnews #viralpost #LeaderTeluguNews #Leader #TeluguNews #LeaderWorldNews #leaderworldnews #leadernews #leadertvnews

బెట్టింగ్‌కి బానిసై భార్య, బిడ్డని కడతేర్చిన తండ్రి

క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడి డబ్బులు పొగొట్టుకున్నాడు. అప్పులు ఎక్కువై చివరికి
కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఈ విషయంలో భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో అతను కసాయిగా మారాడు.. భార్యను, అభం శుభం తెలియని చిన్నారిని కడతేర్చి పరారయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని యాడికిలో వెలుగు చూసింది. 
తాడిపత్రి డీఎస్పీ గంగయ్య కథనం మేరకు వివరాలు.. యాడికికి చెందిన చంద్రావతి(28)కి పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడుకు చెందిన రామకృష్ణతో అయిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు శాన్విత, తొమ్మిది నెలల చైత్రిక ఉన్నారు. కొన్నాళ్లు క్రిష్టిపాడులోనే ఉన్నారు. రెండేళ్ల క్రితం యాడికి వచ్చి చౌడేశ్వరి కాలనీలో అద్దెకు ఇల్లు తీసుకుని ఉంటున్నారు. రామకృష్ణ మగ్గం పని చేసేవాడు. వీరి సంసారం సవ్యంగా సాగుతుండగా.. రామకృష్ణ క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు.

కుటుంబ పోషణ కష్టంగా మారడంతో భార్యభర్తలిద్దరూ తరచూ గొడవ పడేవారు. రాత్రి ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఆగ్రహానికి గురైన రామకృష్ణ భార్యను కట్టేసి ముఖంపై దిండుతో అదిమి హత్య చేశాడు. తొమ్మిది నెలల చిన్నారి చైత్రిక తలపై బియ్యం సంచి ఉంచి పరారయ్యాడు. పెద్ద కుమార్తె శాన్విత అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటుండటంతో ప్రాణాలతో బయటపడింది.  ఘటనా స్థలాన్ని డీఎస్పీ గంగయ్య, సీఐ నాగార్జునరెడ్డి పరిశీలించారు. హత్యకు ఉపయోగించిన దిండ్లు, పరికరాలను, ఆధారాలు సేకరించారు.  బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.