Current Date: 05 Oct, 2024

కూలిన ఇల్లు నిద్రలోనే కుటుంబం మృతి

మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో చోటు చేసుకుంది. మృతులను గురుశేఖర్‌రెడ్డి(45), దస్తగిరమ్మ(38) దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర(16), గురులక్ష్మి(10)గా గుర్తించారు. వీరంతా ఇంట్లో నిద్రిస్తుండగా గురువారం అర్ధరాత్రి మట్టి మిద్దె కూలింది. శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు హుటాహుటిన శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికితీశారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబంలో మొత్తం ఐదుగురు ఉండగా.. మరో కుమార్తె ప్రసన్న కడప జిల్లా ప్రొద్దుటూరు ఉషోదయ పాఠశాలలో చదువుతోంది.

Share